Friday, April 19, 2024

గోమూత్రం తాగండి.. క‌రోనా ఏం చేయ‌లేదు: బీజేపీ ఎంపీ సాధ్వీ

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండం చేస్తోంది. కరోనా కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. అవి పూర్తిస్థాయిలో వైరస్ నుంచి రక్షణ కల్పించ లేవు. వైరస్ ఉద్ధృతి పెరగకుండా వ్యాక్సిన్లు నియంత్రిస్తున్నాయి. అయితే, కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు గోమూత్రం తాగితే చాలట. అదీ దేశీ గోమూత్రం అయితేనే ఫలితాలు ఉంటాయట. ఈ మాటలు చెప్పింది మరెవరో కాదు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచె భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్.

తాను రోజూ గోమూత్రం తీసుకుంటానని, అందుకే కరోనా ఇంతవరకు తన దరి జేరలేదని పేర్కొంది. రోజూ గోమూత్రం తాగితే కరోనా వల్ల ఊపిరి తిత్తుల్లో ఏర్పడ్డ జబ్బు నయమైపోతుందని ఆమె అన్నారు. గోమూత్రం అపర సంజీవని చెప్పారు. భోపాల్‌లోని బైరాగర్ లో జ‌రిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ కామెంట్స్ చేశారు. ఇదే క్ర‌మంలో దేశి ఆవును అందరూ పెంచుకోవాలని సాధ్వీ ప్రగ్యా సూచించారు. కాగా, గోమూత్రంతో మరికొన్ని గోపదార్థాలు కలిపి సేవిస్తే తనకు కేన్సర్ తగ్గిందని రెండేళ్ల క్రితం ప్రగ్య ప్రకటించారు. 2020 డిసెంబర్ లో కోవిడ్ లక్షణాలతో ఆమె ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఎంపీ సాధ్వీ ప్రగ్యా నుండి చేసిన వింత ప్రకటన ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 

మరోవైపు ఆవుపేడ గానీ, గోమూత్రం గానీ కోవిడ్ రాకుండా చూస్తాయని లేదా వచ్చిన తర్వాత నయం చేస్తాయనడానికి శాస్త్రీయమైన ఆధారాలేవీ లేవని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అనేకసార్లు ప్రకటించింది.

ఇదిఇలా ఉంటే.. దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న తరుణంలో.. ఉత్తర్​ ప్రదేశ్​లోని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోమూత్రం తాగితే కరోనా దరికిచేరదని, ప్రజలు కూడా గోమూత్రం తీసుకోవాలని చెబుతూ ఓ వీడియో సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement