Tuesday, March 26, 2024

జార్ఖండ్‌ కాల్పుల్లో హైదరాబాద్‌ వాసి మృతి

జార్ఖండ్‌ రాష్ట్రంలో నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి మృతిచెందాడు. ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు చెందిన కంపెనీలో కాంట్రాక్ట్ మేనేజర్‌గా వీ.శరత్ బాబు పనిచేస్తున్నారు. గతంలో ఒరిస్సాలో జరిగిన ప్రాజెక్టు వర్క్‌లో సైతం శరత్ బాబు పనిచేశారు. కాంట్రాక్టు వర్క్ విషయమై నాలుగు రోజుల క్రితం జార్ఖండ్ వెళ్లారు. కాంట్రాక్ట్ పనుల్లో భాగంగా వాహనంలో వెళుతుండగా… నక్సలైట్లు అతన్ని కాల్చి చంపారు. శరత్ బాబుకు భార్య, ఒక కొడుకు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement