Friday, April 19, 2024

Hyderabad: స‌రూర్ న‌గ‌ర్ కార్పొరేట‌ర్ పై కేసు న‌మోదు..

హైద‌రాబాద్ లోని స‌రూర్ న‌గ‌ర్ కార్పొరేట‌ర్ పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. మంత్రి కేటీఆర్ పై సోష‌ల్ మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఆకుల‌ శ్రీ‌వాణిపై కేసులు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 4న సీసీఎస్ లో హాజ‌రు కావాల‌ని పోలీసులు సూచించారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. సోషల్ మీడియాలో కార్పొరేట‌ర్ శ్రీ‌వాణి మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ పోస్టులు చేయ‌డంపై టీఆర్ఎస్ నాయకులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ సోషల్ మీడియాలో పని చేసే సిబ్బంది తనపై తప్పుడు కేసు పెట్టారంటూ కార్పొరేటర్ శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement