Thursday, March 28, 2024

‘బేగం బజార్‌’‌పై కరోనా ఎఫెక్ట్

హైదరాబాద్ నగరంలో ప్రముఖ వ్యాపార కేంద్రం బేగంబజార్‌‌పై కరోనా ఎఫెక్ట్‌ పడింది. పలువురు వ్యాపారులకు కరోనా రావడం, మార్కెట్లో విపరీతమైన రద్దీ ఉండడంతో బేగంబజార్‌లో ఈ నెల 9 నుంచి దుకాణాల వేళలను మార్చారు. శుక్రవారం నుంచి ఉదయం 9 గంటలకు దుకాణాలు తెరిచి సాయంత్రం 5 గంటల వరకే మూసివేస్తామని ది హైదరాబాద్‌ కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠి, ప్రధాన కార్యదర్శి మహేష్‌కుమార్‌ అగర్వాల్‌ తెలిపారు. బేగంబజార్, ఛత్రి, ఫిష్‌ మార్కెట్, మిట్టికా షేర్‌ తదితర ప్రాంతాల్లోని హోల్‌సేల్‌ కిరాణ దుకాణాలన్నీ తమ అసోసియేషన్‌ నిబంధనలు పాటిస్తాయన్నారు. ప్రతి దుకాణం వద్ద కొనుగోలుదారులు, వ్యాపారస్తులు మాస్క్‌లు ధరించేలా, శానిటైజర్‌ వాడేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement