Sunday, March 24, 2024

భర్త మర్మాంగంపై వేడినీళ్లు పోసిన భార్య

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై భార్య ఏకంగా వేడి నీళ్లు పోసింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి ఏలూరులో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య చెలరేగిన వివాదంతో నిద్రిస్తున్న భర్తపై భార్య వేడి వేడి నీళ్లు పోసింది.

ఈ వేడి నీటిని మర్మాంగంపై కూడా పోయడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న  టూటౌన్ సీఐ ఆది ప్రసాద్, ఎస్సై కిషోర్ బాబు వివరాలు సేకరిస్తున్నారు. బాధితుడు ఏలూరు పత్తే బాధ సెంటర్‌లో టైలర్ గా పని చేస్తున్నట్లు సమాచారం. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement