Thursday, April 25, 2024

పాక్ లో ఆక‌లి కేక‌లు.. గోధుమ పిండికోసం 11 మంది మృతి..

పాకిస్థాన్ లో ఆక‌లి కేక‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఆ దేశం ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన ప‌రిస్థితి. అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు స‌రిప‌డా ఆహారం పంపిణీ చేయ‌డంలో విఫ‌మైంద‌నే చెప్పాలి. గోధుమ పిండితో వస్తున్న ట్రక్కులు కనిపిస్తే వందలాది మంది వెంబడిస్తూ గోధుమ పిండిని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాకెక్కుతూ అక్కడి ఆహార సంక్షోభ తీవ్రతను ప్రపంచం కళ్లకు కడుతున్నాయి. పాక్ లో ప్రజలకు ఉచితంగా గోధుమ పిండిని అందించేందుకు పలు ప్రాంతాల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల వ‌ద్ద ఎలాంటి బందోబ‌స్తు గానీ, నియంత్రణ లేకపోవడంతో ఎవరికి వారే గోధుమ పిండిని దక్కించుకునేందుకు పోటీ ప‌డ్డారు. గోధుమ పిండిని దక్కించుకునే క్రమంలో పంజాబ్ ప్రావిన్సులో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. తొక్కిసలాట ఘటనలపై స్పందించిన పంజాబ్ కేర్‌టేకర్ ముఖ్యమంత్రి మోసిన్ నక్వీ కీలక ప్రకటన చేశారు. రద్దీని తగ్గించేందుకు ఉదయం ఆరు గంటల నుంచే కేంద్రాలను తెరుస్తామని, ప్రావిన్సు వ్యాప్తంగా ఉచిత పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement