Friday, April 19, 2024

శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం.. ఒక్క రోజులో రూ.7.68 కోట్లు

తిరుమల , ప్రభన్యూస్‌ ; తిరుమల శ్రీవారికి రికార్ట్‌స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. ఆంగ్ల నూతన సంవత్సరాది రోజున భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా టిటిడి చరిత్రలోకే అత్యధికంగా రూ.7.68 కోట్ల రూపాయల ఆదాయం శ్రీవారికి లభించింది. ఒక్క రోజు ఇంతపెద్ద మొత్తంలో హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే తొలిసారి.

గతేడాది అక్టోబర్‌ 23 లభించిన 6.31 కోట్ల హుండీ ఆదాయమే ఇప్పటి వరకు అత్యధికంగా కాగా ఆ రికార్డు ఇపుడు బ్రేక్‌ అయింది. ఆదివారం తక్కువ సంఖ్యలో భక్తులు స్వామివారికిని దర్శించుకున్నా ఇంతపెద్ద మొత్తంలో హుండీ ఆదాయం లభించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement