Friday, March 29, 2024

బోరుబావిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి

ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. హార్దోయి జిల్లా కొత్వాలి మండలం హర్దపల్పూర్‌లో బోరుబావిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. వివరాల ప్రకారం.. శ్యామ్​జీత్(3) బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడ్డాడు. దీంతో ఘటనా స్థలంలో శ్యామ్​జీత్‌ను రక్షించేందుకు పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. అనంతరం పోలీసులు.. క్షేమంగా బాలుడిని బోరు బావి నుంచి బయటకు తీశారు. కానీ, ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో శ్యామ్ జీత్ మృతి చెందాడు. బాలుడి మరణంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అములుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement