Wednesday, April 24, 2024

భారత్‌లో కొత్త కరోనా కేసులు ఎన్నంటే?

దేశంలో క‌రోనా అదుపులోనే ఉంది. రోజువారి కేసుల సంఖ్య రెండు వంద‌లు దాట‌డం లేదు. దేశంలో తాజాగా 188 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. కేసుల సంఖ్య త‌క్కువ‌గానే న‌మోద‌వుతున్న‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,46,77,647కు చేయ‌గా.. ఇందులో 4,41,43,483 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరో 3,468 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, గత 24 గంటల్లో వైరస్‌ వల్ల ఎవరూ మరణించలేదని స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సిన్ పంపిణీ ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. ఇప్పటివరకు 220.07 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. మంగళవారం ఒక్కరోజే 90,529 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని ప్రకటించింది. మంగళవారం 1,34,995 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement