Friday, April 19, 2024

Breaking: త‌మిళ‌నాడులో ప‌రువు హ‌త్య‌..

తమిళనాడు రాష్ట్రంలో పరువు హత్య వెలుగు చూసింది. తన కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తోందని ఆమెను త‌ల్లే హత్య చేసింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన తిరునల్వేలి పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరుముగ కని, పిచయ్ దంపతులకు అరుణ అనే 19 ఏళ్ల కూతురు ఉంది. అరుణ ప్రస్తుతం వేరే ఊళ్లూ ఉంటూ నర్సింగ్ కోర్స్ చదువుతోంది. అయితే, అక్కడే వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తోంది. ఈ విషయాన్ని అరుణ ఇటీవల తన తల్లి అరుముగ కనికి చెప్పింది.

ఈ విషయంపై మాట్లాడేందుకు అరుణను తల్లి ఇటీవల ఇంటికి పిలిపించింది. త‌ను చూపించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని తల్లి చెప్పగా.. తను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు అరుణ చెప్పింది. ఈ విషయంపై తల్లీ కూతుళ్ల మధ్య వాగ్వాదం తలెత్తి.. గొడవ పెద్దదైంది. దీంతో కోపం తెచ్చుకున్న తల్లి తన కూతురు గొంతు కోసి చంపింది. తర్వాత తను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది. హెయిర్ డై తాగి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement