Saturday, April 20, 2024

వివాదంలో హీరోయిన్ త్రిష, దర్శకుడు మణిరత్నం

ఓ హిస్టారికల్ ఫిక్షనల్ నవల ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం పొన్నియ‌న్ సెల్వ‌న్ అనే తమిళ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష, కార్తి, జయం రవి, విక్రమ్ ప్రభు, జయరామ్, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా శుక్రవారం త్రిష కారు దిగి చెప్పులతో శివుడు, నంది విగ్రహాల మధ్య నడుచుకుంటూ వచ్చిన సన్నివేశాలను చిత్రీకరించారు. హిందువులు పవిత్రంగా భావించే దేవుళ్ల విగ్ర‌హాల మ‌ధ్య త్రిష పాద‌ర‌క్ష‌లు ధరించి రావ‌డాన్ని హిందూ సంఘాల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. త్రిష, దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదు చేయాలని హరికేష్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు

గతంలోనూ ఈ సినిమాపై వివాదం చెలరేగింది. ఈ సినిమా షూటింగ్ సెట్‌‌లో ఓ గుర్రం మ‌ర‌ణించ‌డంతో మ‌ణిర‌త్నంపై కేసు న‌మోదైంది. పెటా ఇండియా మ‌ణిర‌త్నంతో పాటు సినిమా నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యాన‌ర్, గుర్రం య‌జ‌మానిపై కూడా కేసు న‌మోదు చేసింది. ఇక తాజాగా శివుడు, నంది విగ్రహాల మధ్యలో సన్నివేశాల నేపథ్యంలో హీరోయిన్ త్రిష‌, దర్శకుడు మ‌ణిర‌త్నాన్ని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement