Wednesday, April 24, 2024

కరోనా పరిస్థితితులపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ..

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుంది. కోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మే 8 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఈరోజు మరోసారి హైకోర్టులో విచారణ జరుగనుంది. ఇప్పటికే కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది కాగా ఈ రోజు హైకోర్టు చేయబోయే వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement