Saturday, April 20, 2024

రేప్‌కి గురైన బాలిక‌.. 27 వారాల గర్భం అబార్ష‌న్‌కి హైకోర్టు అనుమతి..

అత్యాచారానికి గురైన బాలిక గర్భం దాల్చిన కేసులో, రాజస్థాన్‌ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. మెడికల్‌ బోర్డు నివేదిక ఆధారంగా, 27 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇచ్చింది. అదనపు అడ్వకేట్‌ జనరల్‌ మనీష్‌ వ్యాస్‌ కోర్టుకు నివేదిక సమర్పించారు. గణించిన ప్రమాదంతో గర్భాన్ని విచ్ఛిన్నం చేయవచ్చని కోర్టు పేర్కొంది. అవాంఛిత గర్భం కారణంగా బాలిక అనుభవించిన మానసిక క్షోభను ఉదహరించిన జస్టిస్‌ వినీత్‌ కుమార్‌ మాథుర్‌, దానిని విచ్ఛిన్నం చేసుకునే హక్కు ఆమెకు ఉందని స్పష్టంచేశారు.

కాబట్టి పిటిషనర్‌ను సమర్థులైన వైద్యుల వద్దకు తీసుకెళ్లాలని ఆదేశించారు. గర్భస్రావం సందర్భంలో వైద్యులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. అటువంటి హక్కులను వినియోగించు కోవడానికి స్త్రీకి స్వయం ప్రతిపత్తి ఉండాలి. వివాహిత, అవివాహిత స్త్రీల మధ్య కృత్రిమ వ్యత్యాసం కొనసాగించలేమని సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు పేర్కొంది. అవివాహిత స్త్రీలు కూడా ఏకాభిప్రాయంతో ఏర్పడే 24 వారాల గర్భాన్న తొలగించుకునేందుకు అర్హులని తీర్పు చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement