Thursday, April 25, 2024

విజయసాయిరెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈడీ కేసులు తొలుత విచారణ జరపాలని సీబీఐ కోర్టు ఆదేశించడాన్ని విజయసాయి హైకోర్టులో సవాల్ చేశారు. మొదట సీబీఐ కేసులు విచారణ జరపాలని, లేదంటే సీబీఐ, ఈడీ కేసులు రెండింటిని సమాంతరంగా విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని విజయసాయి హైకోర్టును కోరారు.

అయితే విజయసాయిరెడ్డి వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఈడీ కేసులే మొదట విచారించాలన్న సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. మరోవైపు జగతి పబ్లికేషన్స్, రఘురాం సిమెంట్స్ పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టివేసింది.

ఈ వార్త కూడా చదవండి: విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

Advertisement

తాజా వార్తలు

Advertisement