Friday, March 29, 2024

హైకోర్టులో ఈటెల రాజేందర్ భార్యకు చుక్కెదురు

అసైన్డ్ భూముల ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ (మెదక్ జిల్లా మాసాయిపేట మండలం) భూముల సర్వే కొనసాగుతోంది. దీనిపై ఈటెల రాజేందర్ భార్య జమున హైకోర్టును ఆశ్రయించారు. సర్వే నిలుపుదల చేయించాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆమె పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ప్రభుత్వం జారీ చేసిన సర్వే నోటీసులపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో కొన్నిరోజుల పాటు భూ సర్వే వాయిదా వేసేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని ఏజీ తెలిపారు. వాదనల అనంతరం స్టే నిరాకరించిన న్యాయస్థానం… జూన్ రెండో లేదా మూడో వారంలో సర్వే చేయాలని మాసాయిపేట మండల రెవెన్యూ అధికారులను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement