Wednesday, April 24, 2024

కంటికి రెప్ప‌లా స‌చివాల‌య భ‌ద్ర‌త‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సచివాలయ భద్రతా చర్యలకు అన్ని చర్యలు తీసుకున్నామని సీఎస్‌ శాంతికుమారి వెల్లడిం చారు. సచివాలయం చుట్టూ ఆరు సెంట్రీ పోస్టులు, 300 సీసీ టీవీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భద్రతా చర్యల పర్యవె క్షణకు ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు ఆమె ప్రకటించారు. 3 కంపెనీల తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌, 300 సిటీ పోలీస్‌ అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేపట్ట ను న్నట్లు వెల్లడించారు. ఈనెల 17న సీఎం కేసీఆర్‌ చేతలమీదుగా ప్రారంభం కానున్న డా. బిఆర్‌ అంబేద్కర్‌ నూతన సచివా లయం భవన సముదాయంలో భద్రతా ఏర్పాట్లు, 11న జరుగ నున్న ఫార్ములా ఈ-రేసింగ్‌ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి శాంతి కుమారి అధ్యక్షతన మంగళవారం బిఆర్కేఆర్‌ భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంనిర్వహించారు. డీజీపీ అంజనీ కుమార్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, నగర పోలీస్‌ కమీషనర్‌ సి.వి.ఆనంద్‌, ఎస్పీఎఫ్‌ డీజీ ఉమేష్‌ ష్రాఫ్‌, అడిషనల్‌ డీజీ సంజయ్‌ కుమార్‌ జైన్‌, ఫైర్‌ సర్వీసుల డీజీ నాగి రెడ్డి, ఇంటలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ అనిల్‌ కుమార్‌, ఈ.ఎన్‌.సి గణపతి రెడ్డిలతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

11 న జరుగనున్న అత్యంత ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ-రేస్‌ నేపథ్యంలో తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ నుండి ఖైరతాబాద్‌ ప్లnయ్‌ ఓవర్‌ వరకు, మింట్‌ కాంపౌండ్‌ నుండి ఐమాక్స్‌ వరకు రహ దారులను ఈనెల 5 నుండి మూసివేత. ప్రత్యామ్నాయ మార్గాలపై నగరవాసులకు అవగా#హన కల్పించాలి. ఫార్ములా ఈ రేస్‌ సందర్బంగా సచివాలయ పనులకు అం తరాయం కలుగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటు. ఈనెల 17 ప్రారంభం కానున్న డా. బిఆర్‌ అంబేద్కర్‌ సచివాలయానికి విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. పోలీస్‌ శాఖ, రోడ్లుభవనాలు, జీఏడీ, తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌, ఐటి తదిత రశాఖలు సమ న్వయంతో పనిచేయాలని తీర్మానించారు. 3 కంపెనీల తెలం గాణ స్పెషల్‌ పోలీస్‌, 300 సిటీ పోలీస్‌ అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సిటీ ట్రాఫిక్‌ విభాగం నుండి 22 ట్రాఫిక్‌ అధికారులను కేటాయించినట్లు వెల్లడిం చారు. భద్రతా పరమైన పరికరాలైన బ్యాగేజ్‌ స్కానర్లు, వె#హకిల్‌ స్కానర్లు, బాడీ స్కానర్లు, ఇతర పరికరాలను సమకూ ర్చుకోవాలని నిర్ణయించారు. మొత్తం 28 ఎకరాలలోని 9.42 చ. అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నూతన సచివాలయంలో 560 కార్లు, 900 లకు పైగా ద్విచక్ర వా#హనాల పార్కింగ్‌కు సదుపాయం కల్పించినట్లు సీఎస్‌ తెలిపారు. సచివాలయం చుట్టూ ఆరు సెంట్రీ పోస్టుల ఏర్పాటు. 300 సీసీ టీవీలద్వారా భద్రతా పర్యవేక్షణ కొనసాగు తుం దని తెలిపారు. సీసీ టివిలతో పాటు ఇతర భద్రతా పరమైన చర్యల పర్యవేక్షణకు ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఆధునాతన కార్పొరేట్‌ కార్యాలయాల మాదిరిగా సచివాలయంలోకి వచ్చి వెళ్లే సంద ర్శకులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులతో కూడిన మానిటరింగ్‌ ఉంటుందని తెలిపారు. 34 మంది సిబ్బందితో రెండు ఫైర్‌ ఇంజన్లను సచివా లయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సచివాలయ భవ నంలో ఫైర్‌ సేఫ్టీ ఏర్పాట్లు చేశారు. నూతన సచివాల యంలోదివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తు న్నారు. 6 వ అంతస్తు మినహా అన్ని అంతస్తులకు సందర్శకులకు పరిమితమైన అను మతి ఉండనుంది. ఇప్పటికే జలమండలి ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేసిన అధికారులు సీవరేజ్‌ పనుల పురోగతిలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement