Saturday, April 20, 2024

పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉంటే నేనే చెబుతా-నిత్యా మీన‌న్

హీరోయిన్ నిత్యామీన‌న్ త‌న పెళ్లిపై వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందించింది. మ‌ల‌యాళ న‌టుడితో నిత్య ప్రేమ‌లో ఉన్న‌ట్లు, త్వ‌ర‌లోనే అత‌డిని పెళ్ళి చేసుకోబోతున్న‌ట్లు వార్త‌లు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా వీటిపై నిత్య‌మీన‌న్ స్పందించింది.
త‌న వివాహం గురించి వ‌చ్చిన వార్త‌ల్లో నిజంలేద‌ని, ఏ విష‌య‌మైనా నిజం అని తెలిసాకే మీడియాలో ప‌బ్లిష్ చేయాల‌ని చెప్పింది. అంతేకాకుండా పెళ్ళి చేసుకునే ఉద్ధేశ‌మే ఉంటే త‌నే స్వ‌యంగా చెబుతాన‌ని తెలిపింది. ఈ విధంగా త‌న పెళ్ళిపై వ‌స్తున్న‌ వార్త‌ల‌ను నిత్యమీన‌న్‌ ఖండించింది. ఇక సినిమాల విష‌యానికొస్తే ప్ర‌స్తుతం నిత్య న‌టించిన ‘తిరుచిత్రంబ‌లం’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ధ‌నుష్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో రాశీఖ‌న్నా, ప్రియా భ‌వాని శంక‌ర్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. దీనితో పాటుగా విజ‌య్ సేతుప‌తితో ’19(1)a’, షైన్ టామ్‌ చాకోతో ‘ఆరామ్ తిరుక‌ల్ప‌న’ సినిమాల్లో న‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement