Saturday, April 13, 2024

సుధీర్ బాబు కొత్త మూవీ..డిఫరెంట్ గా పోస్టర్ లాంఛ్

సినిమా హిట్టా..ఫట్టా అనేది చూడటం లేదు నేటి హీరోలు..వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే వారిలో ఒకడిగా నిలుస్తాడు హీరో సుధీర్‌ బాబు.. తాజాగా మరో సినిమాను ప్రకటించారు. సుధీర్‌ బాబు 18వ ప్రాజెక్టు ను ఇన్‌ లాండ్‌ లెటర్‌ పోస్టర్‌తో లాంఛ్‌ చేశారు. ఈ చిత్రానికి సెహరి ఫేం జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ఎస్‌సీ (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌) బ్యానర్‌ పై సుమంత్‌ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.1989 కుప్పం నేపథ్యంలో డివైన్ టచ్‌తో సాగే కథ నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్టు సమాచారం. సుధీర్‌ బాబు గతంలో ఎన్నడూ కనిపించని కొత్త లుక్‌లో కనిపించబోతున్నారట. అరుణ్‌ గౌలి ఆఫ్‌ సౌత్‌ బాంబే ఫ్రమ్‌ అడ్రస్‌తో చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సుబ్రహ్మణ్యంకు ఈ లేఖను రాసినట్టు అర్థమవుతుంది. లేఖలో ‘విషమం.. మీరు తప్పకుండా రావాలి.. ‘అనే సందేశం కూడా ఉంది. గ్రామం, గుడి, తుపాకి, బుల్లెట్స్ పాత రూపాయి నోటు, ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌, సిగరెట్ కూడా పోస్టర్‌లో కనిపిస్తున్నాయి.అక్టోబర్‌ 31న మాస్‌ సంభవం అని పేర్కొన్నారు. దీన్ని బట్టి అక్టోబర్‌ 31న మా మరో అప్‌డేట్‌ ఇవ్వనున్నట్టు మేకర్స్‌ తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement