Wednesday, April 17, 2024

నానికి.. మ‌రాఠా అభిమాని గిఫ్ట్

ఓ అభిమాని హీరో నానిపై త‌న‌కి ఉన్న అభిమానాన్ని వెరైటీగా చూపించాడు.అయితే అత‌ను తెలుగు అభిమాని కాదు..మరాఠా అభిమాని నానీ కోసం కొత్తగా ట్రై చేశాడు. మహారాష్ట్ర కు చెందిన విపుల్ మిరాజ్‌కార్ అనే ఓ ఆర్టిస్ట్ రకరకాల బొమ్మలు, పెయింట్స్ వేస్తూ ఉంటాడు. రంగులతో బొమ్మలని గీస్తూ ఉంటాడు. నాని దసరా సినిమా మార్చ్ 30న రిలీజ్ ఉండటంతో నాని పై అభిమానంతో విపుల్ మిరాజ్‌కార్ ఓ డాబాపై 30 అడుగులతో నాని దసరా లుక్ ని గీసి న్యాచురల్ కలర్స్ తో ఆ బొమ్మని నింపాడు. అయితే అది అచ్చంగా కలర్ ప్రింట్ తీసినట్టు అద్భుతంగా గీశాడు. ప్రస్తుతం ఈ ఫోటో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విపుల్ మిరాజ్‌కార్ తో పాటు అతనికి తన ఫ్రెండ్స్ కూడా సాయం చేయడం విశేషం. ఈ బొమ్మను గీయడంలో వారు కూడా పాలు పంచుకున్నారు. ఇక ఈ బొమ్మను వేస్తున్న వీడియోను డ్రోన్ ద్వారా క్యాప్చర్ చేసి.. బోమ్మ వేసిన తరువాత కూడా వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఈ వీడియోకి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఆ ఆర్టిస్ట్ ను తెగ అభినందిస్తున్నారు నెటిజన్లు. దసరా సినిమాతో కాస్త డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈమూవీలో నానీ జతగా కీర్తి సురేష్ కనిపించబోతోంది. ఈమూవీని మార్చ్ 30 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement