Thursday, April 25, 2024

పెళ్లి పీటలెక్కిన నాగశౌర్య.. వైరల్ గా మ్యారేజ్ ఫొటోలు

ఎట్టకేలకు ఓ ఇంటి వాడయ్యాడు యంగ్ హీరో నాగశౌర్య. పెళ్లి ఐదు రోజులు ఉందనగా అస్వస్థతకి గురయిన నాగశౌర్య నేడు పెళ్లిపీటలెక్కారు. కర్ణాటక కుందాపూర్‌కు చెందిన ప్రముఖ ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టిని ఆయన పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో ఓ స్టార్‌ హోటల్‌లో వీరి వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య వైభవంగా జరిగింది. ముందుగా నిశ్చయించిన సమయం ఉదయం 11.25గంటలకు నాగ‌శౌర్య నూతన వధువు అనూష మెడలో బంధు, మిత్రుల సమక్షంలో మూడు ముళ్లు వేశాడు. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగశౌర్య-అనూష జోడీ బాగుందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. పెళ్లి కుమారుడిగా నాగశౌర్య తెల్లటి పంచ, షర్టులో సంప్రదాయంగా కనిపిస్తున్నారు. అతడి భార్య అనూష ఎరుపు రంగు చీరలో బాపూ బొమ్మలా ముస్తాబైంది. వీరి పెళ్ళి ఫొటోలు వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement