Thursday, March 28, 2024

చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంచు మనోజ్

హైదరాబాద్‌లో అత్యాచారానికి గురైన చిన్నారి చైత్రకు న్యాయం చేయాలంటూ పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైత్ర కుటుంబాన్ని సినీ హీరో మంచు మనోజ్ పరామర్శించాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఒక క్రూరత్వం. చైత్ర తల్లి నా కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే ఒక చేతకాని వాడిలా అనిపించిందంటూ చెప్పుకొచ్చారు. మహిళలకు, పిల్లలకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని ప్రతి ఒక్కరు కూడా నేర్పించాలన్నారు.

అలాగే ఈ ఘటన జరిగి ఆరు రోజులు అవుతున్నా ఇంకా అన్ని ఆ నీచుడి జాడ దొరకలేదని.. పోలీసులు కూడా కష్ట పడుతున్నారని మనోజ్ చెప్పాడు. ప్రజలు ప్రభుత్వం, పోలీసు వారు అందరూ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ప్రతి ఏరియాలో కూడా జల్లెడపట్టి నిందితుడిని పట్టుకోవాలన్నారు. టీవీ ఛానల్ ఆన్ చేస్తే సాయి ధరమ్ తేజ్ అలా పడ్డాడు.. సాయి ధరమ్ తేజ్ ఇలా పడ్డాడు అంటూ త్రీడీ చేసి చూపిస్తున్నారు తప్ప… ఈ విషయం గురించి ఎవరు చూపించడం లేదని మీడియాపై మండిపడ్డారు. ప్రతి మీడియా ఛానల్ కూడా ఈ విషయాన్ని టీవీలలో చూపించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement