Thursday, March 28, 2024

శ్రీవారిని ద‌ర్శించుకున్న ‘నాగార్జున’ దంప‌తులు

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు హీరో అక్కినేని నాగార్జున దంప‌తులు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ .. ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు. క‌రోనా కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అవి తొల‌గిపోవాల‌ని అన్నారు. రెండు సంవత్సరాల తరువాత అయినా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంద‌ని ఆయ‌న చెప్పారు.

కాగా, అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా నిర్మించిన బంగార్రాజు సినిమాలో నాగార్జున‌, నాగ‌చైత‌న్య, ర‌మ్యకృష్ణ‌, కృతి శెట్టి, రావు ర‌మేశ్, త‌దిత‌రులు న‌టించారు. సంక్రాంతికి అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన ‘బంగార్రాజు’ సినిమా బాక్సీఫీస్ ను షేక్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. కల్యాణ్ కృష్ణ రూపొందించిన ఈ సినిమాకు మంచి స్పంద‌న వ‌స్తుండ‌డంతో నాగార్జున త‌న భార్య అమ‌ల‌తో క‌లిసి ఈ రోజు తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement