Thursday, April 25, 2024

హీరో అజిత్ తండ్రి క‌న్నుమూత‌

వృద్దాప్య కారణాల రీత్యా అనారోగ్య సమస్యలతో క‌న్నుమూశారు త‌మిళ స్టార్ హీరో అజిత్ తండ్రి పి సుబ్ర‌హ్మ‌ణ్యం. చెన్నైలోని బెసంత్‌ నాగ శ్మశాన వాటికలో సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుబ్రహ్మణ్యం స్వస్థలం కేరళలోని పాలక్కాడ్‌. ఆయన కోల్‌కతాకు చెందిన మోహినీ (సింధి ఫ్యామిలీ)ని పెళ్లి చేసుకున్నారు. సుబ్రహ్మణ్యంకు ముగ్గురు కుమారులు కాగా.. అజిత్‌కుమార్ రెండోకుమారుడు. అజిత్‌ కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, సుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు.సుబ్రహ్మణ్యం మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement