Monday, April 15, 2024

టాలీవుడ్ హీరో అడివి శేష్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

టాలీవుడ్ హీరో అడివి శేష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కొన్నిరోజుల కింద అడివి శేష్ కు జ్వరం రాగా, వైద్య పరీక్షల్లో డెంగీ అని తేలింది. గత వారం ప్లేట్ లెట్ల సంఖ్య బాగా పడిపోయినట్టు గుర్తించారు. దాంతో ఈ నెల 18న ఆయనను హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

నిపుణులైన డాక్టర్ల బృందం అడివి శేష్ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. అడివి శేష్ ప్రస్తుతం గూఢచారి-2, హిట్-2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. గతంలో హిట్టయిన గూఢచారి, హిట్ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కుతుండగా ఆ రెండు చిత్రాల్లో అడివి శేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement