Thursday, April 18, 2024

‘మా’లో కలకలం రేపుతున్న నటి హేమ వాయిస్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ‘మా’ అధ్యక్ష పీఠం కోసం ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్, మంచు విష్ణు, హేమ, నరసింహారావు పొటీ పడుతున్నారు. కానీ పోటీ మాత్రం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికల గురించి ‘మా’ సభ్యులకు నటి హేమ పంపిన వాయిస్ సందేశం కలకలం రేపుతోంది. ఈ వాయిస్ మెసేజ్‌లో నటుడు నరేష్‌పై హేమ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇంతకీ ఆ వాయిస్ మెసేజ్‌లో ఏం ఉందంటే…

‘హాయ్ అండి.. ఈ మెసేజ్ నేను ఒక్కక్కరికీ కాకుండా కామన్‌గా చెప్పేస్తున్నాను. 200 నుంచి 250 మందికి లెటర్ పంపిస్తున్నాను. ఏం లేదు ‘మా’ ఎలక్షన్స్ పెట్టకూడదు. నరేష్‌గారే ప్రెసిడెంట్‌గా కొనసాగాలని అవతలివారు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత వరకు ‘మా’ అసోషియేషన్ ఒక్క రూపాయి సంపాదించింది లేదు కానీ.. నరేష్ గారు మొత్తం ఉన్న రూ. 5కోట్లలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టేశారు.

పోయినసారి మెడికల్ క్లైమ్‌కి, రాబోయే మెడికల్ క్లైమ్‌కి కలిపి మొత్తం రెండున్నర కోట్లకు పైగా ఖర్చు అయినట్లు లెక్క. ఆఫీస్ ఖర్చులు అవీ, ఇవీ కలిపి దాదాపు అంతే అవుతుంది. ఇది వరకు ఏంటంటే.. ఆఫీస్ ఖర్చులు బయటి నుంచి తీసుకువచ్చి, మేము ఫండ్ రేజ్ చేసి ఇచ్చే వాళ్లం. ఇప్పుడాయన హాయిగా కూర్చుని మన అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడాయన ఆ కుర్చీ దిగకూడదు… ఎలక్షన్స్ జరగకూడదు అని ప్లాన్స్ వేస్తున్నారు. కాబట్టి మనమందరం ఎలక్షన్స్ కావాలి అని ఈ లెటర్. నేను మనిషిని పంపిస్తాను.. మీరు సంతకం చేసి పంపిస్తే.. నేను ‘మా’ అసోసియేషన్‌కి సబ్మిట్ చేస్తా. ఆ లెటర్‌లో ఉన్న మ్యాటర్, నేను చెప్పే మ్యాటర్ ఒకటే. ప్లీజ్ అందరూ ఎలక్షన్ కావాలని మాత్రం చెప్పండి’ అని వాయిస్ మెసేజ్ ద్వారా హేమ అప్పీల్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ వార్త కూడా చదవండి: బిగ్ బాస్-5: షణ్ముఖ్ జశ్వంత్ పారితోషికం ఎంతో తెలుసా?

Advertisement

తాజా వార్తలు

Advertisement