Wednesday, April 24, 2024

రాత్రి గెలిచాం.. పొద్దున్నే ఓడిపోయాం.. అంతా దుర్గమ్మకే తెలియాలి: నటి హేమ

మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికలు రెండు రోజుల కిందనే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ,.అసోషియేషన్‌ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. విష్ణు ప్యానెల్‌ దౌర్జన్యానికి పాల్పడి.. మా ఎన్నికల్లో గెలిచిందంటూ… ప్రకాష్ రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదవులకు కూడా రాజీనామా చేశారు.

మరోవైపు గురువారం ఉదయం.. ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న నటి హేమ… మా అర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని… దసరాకు ప్రతి ఏటా అమ్మవారిని దర్శించుకుంటానని హేమ చెప్పింది. కొండంత ధైర్యం ఇవ్వమని అమ్మవారిని కోరుకున్నానని.. ‘మా’ ఎన్నికల్లో రాత్రి గెలిచాం.. ఉదయం ఓడిపోయాం.. ఏం జరిగిందో ఆ అమ్మ వారికే తెలియాలంటూ నటి హేమ పేర్కొన్నారు. అసలు మా ఎన్నికల్లో ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి ఉందంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement