Thursday, April 25, 2024

హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై షాక్ కు గుర‌య్యా : నితిన్ గ‌డ్క‌రీ

తమిళనాడులోని కూనూరులో ఘోర ప్రమాదం జరిగింది. 14మంది ఉన్నతాధికారులతో వెళ్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదలో 11మంది ఉన్నతాధికారులు చనిపోయినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్‌ బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులిత రావత్ కూడా ఉన్నారు. అయితే ప్రమాదంలో బిపిన్ రావత్ కు తీవ్రగాయాలు కాగా.. ఆయన భార్య మధులిక చనిపోయినట్లు సమాచారం.
అయితే ఈప్ర‌మాద ఘ‌ట‌న ను తెలుసుకున్న‌ కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ కూ యాప్ ద్వారా స్పందించారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న తెలియ‌గానే షాక్ కు గుర‌య్యాన‌న్నారు. అంద‌రి భ‌ద్ర‌త‌, క్షేమం గురించి ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. ట్విట్టర్ లో చేసిన ఆయన ట్వీట్ కూ యాప్ లో పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement