Friday, March 29, 2024

పల్లె బాటపట్టిన జనం.. హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ మొదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైద‌రాబాద్ నుంచి ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున సొంత ఊళ్ల‌కు త‌ర‌లివెళ్తున్నారు. సెలవులుతో హైదరాబాద్ నుంచి పల్లెబాట్టారు. ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాలతో పల్లెకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ఎన్‌హెచ్‌ 65పై వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. రద్దీతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సాధారణంగా ఉండే ర‌ద్దీ కంటే వాహనాల రాకపోకలు భారీగా పెరగడంతో టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ట్యాక్స్‌ చెల్లింపు కేంద్రాలను పెంచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement