Friday, March 29, 2024

తెలంగాణలో భారీ వర్షాలు.. పాలమూరులో వరదనీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు!

రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవ్వాల (శుక్రవారం) మహబూబ్ నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మాచన్ పల్లి-కోడూరు రూట్​లో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు చేరింది. ఈ వరదల్లో ఓ స్కూలు బస్సు చిక్కుకుపోయింది. ఓ ప్రైవేటు స్కూలుకు చెందిన బస్సు రామచంద్రపురం నుంచి సుగురుతండాకు వెళ్తుండగా రైల్వే అండర్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి నీటి ప్రవాహంలో ముందుకు కదల్లేకపోయింది.

బస్సులో సగానికి నీళ్లు చేరడంతో విద్యార్థులు హాహాకారాలు చేశారు. తీవ్ర భయాందోళనలతో కేకలు వేశారు. అయితే, స్థానికులు స్పందించి బస్సులో చిక్కుకున్న విద్యార్థులను కాపాడారు. అనంతరం బస్సును ఓ ట్రాక్టర్ కు కట్టి వరద నీటి ఉంచి బయటికి లాగారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement