Thursday, April 25, 2024

వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం

వికారాబాద్ (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కొంతకాలంగా ఎండలతో సతమతమైన ప్రజలు ఈ వర్షంతో ఊరట చెందారు. 40 డిగ్రీల పైన ఎండలు ఉండడంతో ప్రజలు బయటికి రాని పరిస్థితుల్లో బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో రిలీఫ్ పొందారు.

దాదాపు గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ ఏరులై పారాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో పాటు సమీప మండలాలైన పూడూరు, దారూరు, మర్పల్లి, మోమిన్ పేట్ లో భారీ వర్షం కురిసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా దుక్కులు దున్నుకోవ‌డానికి ఈజీగా ఉంటుంద‌ని రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement