Monday, April 15, 2024

నెల్లూరు జిల్లా వైసీపీలో వేడెక్కిన రాజకీయం

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. జిల్లాలోని అధికార పార్టీ వైసీపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తైతే.. నెల్లూరు జిల్లా రాజకీయాలు మరోలా ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అసమ్మతి గళం విప్పుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు అసమ్మతి గళం విప్పిన సంగతి తెలిసిందే.

ఆనం రామనారాయణరెడ్డి ఇటీవలే తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపిన సంగతి విధితమే. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపింది. టీడీపీలో చేరేందుకు కోటంరెడ్డి సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెరపైకి వచ్చారు. మరోవైపు జిల్లా రాజకీయాలపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కోసం పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement