Friday, April 19, 2024

భార్యాబిడ్డ‌ల‌ను క‌డ‌తేర్చాడు.. అడ్డొచ్చిన పోలీసునూ చంపేశాడు

గువ‌హ‌టి: భార్య‌, ముగ్గురు పిల్ల‌ల‌తో సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో క‌ల‌హాలు మొద‌ల‌య్యాయి. నిందితుడు తాగుడు అల‌వాటు చేసుకున్నాడు. మ‌త్తులో తూగుతూ… ఎప్ప‌డో ఇంటికొచ్చేవాడు… భార్య‌ను మాన‌సికంగా, శారీర‌కంగా హింసించే వాడు. అయినా భ‌రిస్తూ వ‌చ్చింది. నిన్న కూడా ఫుల్ తాగొచ్చాడు… గొడ‌వ ప‌డ్డాడు. పార‌తో భార్య‌పై దాడి చేసి హ‌త‌మార్చాడు. అడ్డొచ్చిన ఇద్ద‌రు బిడ్డ‌ల‌ను చంపేశాడు. అడ్డుకోబోయిన సోద‌రుడుపైనా దాడి చేశాడు. ప్రాణాలు కోల్పోయాడు.

ఇంత‌లో ఇరుగుపొరుగు వారు చుట్టుముట్ట‌గా.. పారిపోవ‌డానికి య‌త్నించాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నాడు. నిందితుడు పోలీసుపైనా దాడి చేశాడు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ పోలీసును స‌హ‌చ‌రులు హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించాగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల నుంచి త‌ప్పించుకుని పారిపోతూ అడ్డొచ్చిన ఆటోపై దాడి చేశాడు. ఆటోలో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అద‌న‌పు పోలీసు బ‌ల‌గాల‌ను ర‌ప్పించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కిరాత‌కుడి దాడిలో పోలీస్ స‌హా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న త్రిపుర రాష్ట్రంలో ఖొవాయి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. పోలీసులు ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement