Tuesday, April 16, 2024

జైల్లోనే కూతురిపై ఆ ప‌నిచేసి.. ఆపై ప‌రార‌య్యాడు!

జైపూర్: అత‌నొక హ‌త్య కేసులో దోషి. ఓపెన్ ఎయిర్ జైలులో జైలు శిక్ష అనుభ‌విస్తున్నాడు. జైలు నిబంధ‌న‌ల మేర‌కు కుటుంబంతో క‌లిసి ఉండొచ్చు. ఆమేర‌కు భార్య‌, కూతురుతో ఓపెన్ జైలులోనే ఉంటున్నాడు. జైలు శిక్ష‌ అనుభ‌విస్తూ… ప‌రివ‌ర్త‌న‌లో మార్పు రావాలి. అయితే అందుకు విరుద్ధంగా భార్య‌తో నిత్యం గొడ‌వ‌ప‌డుతూ ఉండేవాడు. భ‌ర్త పెట్టే హింస‌కు విసుగుచెంది కూతురిని తండ్రి వ‌ద్దే వ‌దిలేసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేప‌థ్యంలో ఆ దోషి క‌న్ను కూతురుపై ప‌డింది.

ఓ రోజు కుమార్తెపై భౌతికంగా దాడి చేసి, అత్యాచారం చేశాడు ఆ తండ్రి. ఆపై పోలీసుల క‌ళ్లుగ‌ప్పి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి ప‌రార‌య్యాడు. తండ్రి చేసిన దురాగ‌తంపై బాధితురాలు త‌ల్లికి తెలియ‌జేసింది. త‌ల్లీ కూతురు క‌లిసి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగుచూసింది. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని సిరోహి జిల్లాలోని ప్రిజ‌న‌ర్స్ ఓపెన్ ఎయిర్ జైలులో చోటుచేసుకుంది. బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement