Thursday, March 28, 2024

ప్రధాని మోదీతో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ భేటీ

హర్యానా  గవర్నర్ గా బాద్యతలు చేపట్టిన బండారు దత్తాత్రేయ సోమవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో గౌరవపూర్వకంగా కలిశారు. ప్రధాని ముందుగా గవర్నర్ బండారు దత్తాత్రేయ క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.  హర్యానా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, రైతు సంక్షేమం పట్ల ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు.  కేంద్ర ప్రభుత్వ పధకాల అమలులో గవర్నర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని ప్రధాని మోదీ అభిలషించారు. ప్రధాన మంత్రితో భేటీ తనకి మరింత స్ఫూర్తినిచ్చిందని గవర్నర్ బండారు దత్తాత్రేయగారు తెలిపారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement