Tuesday, April 23, 2024

రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ అమలు : హరీష్ రావు..

తెలంగాణలో ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ రెండు రాష్ట్రంలో అమలు చేస్తున్నామని…రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మందికి మాత్రమే లబ్ది చేకూరుతుందని… ఆరోగ్య శ్రీ ద్వారా 87 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది అందుకే ఆరోగ్య శ్రీని అమలు చేస్తున్నామని ప్రకటించారు. గత మే 18 2021 నెల నుండి ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని… మే 18 వతేది నుంచి 1,18,247 మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా చికిత్స అందించామని వెల్లడించారు.

కరోనా, బ్లాక్ ఫంగస్ కు కార్పొరేట్ హాస్పిటల్ లకు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్ లలో వైద్యం అందించామన్నారు. వేరే రాష్ట్రాల వారికి మనం ఆరోగ్య శ్రీని డబ్బులు చెల్లించబోమని తెలిపారు. జీఎస్టీ బకాయులు కేంద్రం నుండి సకాలంలో ఇవ్వడం లేదు. కరోనా కారణంగా జీఎస్టీ బకాయిలను దఫాలుగా 2022 వరకు ఇస్తామని కేంద్రం తెలిపిందని గుర్తు చేశారు.. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని 15 ఆర్ధిక సంఘం సూచించింది కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని… ప్యాకేజ్ పై నిర్మల సీతారామన్ ను అడిగితే ఇప్పటి వరకు నిర్మల సీతారామన్ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్థిక మంత్రి హరీష్ రావు.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వానికి మరో దెబ్బ.. ఎయిడెడ్ స్కూళ్లపై హైకోర్టు కీలక ఆదేశాలు

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement