Monday, March 25, 2024

క‌ల‌ర్ ఫొటోకి అవార్డు రావ‌డం ఆనందంగా ఉంది-ప్రెస్ మీట్ పెట్టిన‌ చిత్ర టీం

68వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల‌లో ఉత్త‌మ జాతీయ చిత్రంగా అవార్డుని అందుకుంది క‌ల‌ర్ ఫొటో చిత్రం. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ తరువాత ఆహాలో రిలీజ్ అయ్యింది. జన్యు న్ గా తీస్తే అందరికీ నచ్చుతుందని ఈ సినిమా ప్రువ్ చేసింద‌న్నారు.హీరో సుహాస్ మాట్లాడుతూ. .న‌న్ను హీరో గా చెయ్యాలి అన్నప్పుడు భయం వేసింది..మంచి సినిమాకి అవార్డ్ రావడం చాలా హ్యాపీగా వుంద‌న్నారు. ఈ సినిమా నేషనల్ లెవెల్ లో రికగ్నైజ్ అయినందుకు చాలా సంతోషంగా వుంది.నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్.నా కెరీర్ లో గుర్తిండిపోయే సినిమా కలర్ ఫోటో అని హీరోయిన్ చాందిని చౌద‌రి తెలిపారు.ఈ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు త‌మ ఆనందాన్ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement