Tuesday, April 23, 2024

బాస‌ర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో ఆనందం.. లాప్టాప్ లు అంద‌జేసిన మంత్రి కేటీఆర్

బాసర ట్రిపుల్ ఐటీలో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ శనివారం తాను వచ్చి ఇచ్చిన హామీ నెరవేర్చారు. బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అన్ని రాజకీయ పార్టీలను కదిలించిన త్రిబుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనకు సర్కారు దిగివచ్చింది. సెప్టెంబరు నెలలో స్వయంగా కేటీఆర్ వచ్చేదాకా విద్యార్థుల ఆందోళన దశలవారీగా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే నవంబర్ నెలలో తాను మళ్ళీ వస్తానని మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పడంతో విద్యార్థులు శాంతించారు. అయినప్పటికీ ఇటీవల ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ వ్యవహారం మళ్లీ ఆందోళనకు కారణ‌మైంది. నవంబర్ నెలలో వస్తానని చెప్పిన మంత్రి కేటీఆర్ పది రోజులు ఆలస్యంగానైనా ఎట్టకేలకు శనివారం బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారితో కలిసి ఆయన ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు. తాను ఇచ్చిన హామీ ప్రకారం లాంఛనంగా విద్యార్థులకు లాప్టాప్ లు అందజేశారు. మిగతా విద్యార్థులు అందరికీ 12వ తేదీన లాప్టాప్ లు ఇస్తారని కేటీఆర్ ప్రకటించారు. దీంతో విద్యార్థుల్లో సంతోషం వెళ్లి విరిసింది. అనంత‌రం స్నాతకోత్సవంలో ఆయన పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement