Saturday, April 20, 2024

రేపటి నుంచి ఒంటి పూట బడులు

రేపటి నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఆదేశాలను ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలు పాటించాలని ఆదేశించారు. అయితే ప్రభుత్వ విద్యార్థులకు 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం యధావిథిగా పెట్టనున్నట్లు తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు మాత్రం స్పెషల్‌ క్లాసులు కొనసాగుతాయన్నారు. పదో తరగతి సెంటర్లు పడే పాఠశాలల పనివేళలు మాత్రం మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడవనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement