Thursday, April 25, 2024

ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. పలు పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల అమలుపై అధికారులకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు నిర్వహించాలని.. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు చేపట్టాలన్నారు. తరువాత మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement