Friday, March 29, 2024

Spl Story | H3N2 ఫ్లూ అలర్ట్‌.. దేశంలో పెరుగుతున్న కేసులు, కీలక ఆదేశాలు జారీచేసిన ICMR

H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ కారణంగా క‌ర్నాట‌క‌, హర్యానా రాష్ట్రాల్లో ఇవ్వాల (శుక్ర‌వారం) ఒక్కొక్కరు చ‌నిపోయిన‌ట్టు అధికార‌క స‌మాచారం. ఈ వార్త త‌ర్వాత కరోనా వైరస్ కాలం తిరిగి వస్తుందనే భయం ప్రజల్లో నెల‌కొంది. ఈ క్రమంలోనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. హెచ్3ఎన్2 ఇన్ఫ్లుఎంజాతో అనారోగ్యంతో ఉన్న పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.

– ఇంట‌ర్నెట్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌

మార్చి నెలాఖరు నాటికి జ్వరల కేసులు తగ్గుముఖం పడతాయని అధికారులు చెప్పారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో ప్రతి సంవత్సరం రెండు సీజన్లలో ఫ్లూ విజృంభిస్తుంద‌ని, మొదట జనవరి నుండి మార్చి వరకు, రెండవది రుతుపవనాలు ముగిసిన తర్వాత ఉంటుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. దేశంలో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్న సమయం ఇదేన‌ని, ప్రస్తుతం OPDలో జ్వరం, అడ్మిట్ అయిన రోగుల కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయని చెప్పారు.

- Advertisement -

H3N2 బాధితుల్లో సగం మంది ఇన్ఫ్లుఎంజా A యొక్క సబ్టైప్ H3N2 డిసెంబర్ 15 నుండి అన్ని జ్వరాలలో సగం మందిలో గుర్తించినట్టుగా ఐసీఎంఆర్ చెప్పింది. ఆసుపత్రిలో చేరిన రోగులలో సగం మంది H3N2 బాధితులే. మొత్తం అడ్మిట్ అయిన రోగులలో 92% మంది జ్వరం, 86% దగ్గు, 27% మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో 16% మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది. 16% మందికి న్యుమోనియా, 6% మందికి మూర్ఛ వంటి కార‌ణాలున్నాయి. H3N2 రోగులలో 10% మందికి ఆక్సిజన్ అవసరం, 7% మందికి ICU అవసరంగా ఉందని ఐసీఎంఆర్ అధికారులు వెల్ల‌డించారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరణ..
మార్చి 9 వరకు దేశంలో 3038 H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ కేసులు నిర్ధారించారు. వీటిలో జనవరిలో 1200 కేసులు, ఫిబ్రవరిలో 1300 కేసులు నమోదయ్యాయి. మార్చి నెలలో మార్చి 9 వరకు మాత్రమే 486 కేసులు నమోదయ్యాయి. అన్ని రకాల వైరల్ ఫీవర్లను కలిపి చూస్తే జనవరి నెలలో దాదాపు 4 లక్షల కేసులు నమోదు కాగా, ఫిబ్రవరిలో 4 లక్షల 36 వేలు, మార్చి 9 రోజుల్లోనే దాదాపు 1 లక్ష 33 వేల కేసులు నమోదయ్యాయి. జనవరిలో 7041 మంది రోగులు అడ్మిట్ కావాల్సి ఉంది. ఇప్పటివరకు ఫిబ్రవరిలో 6919 మంది, మార్చిలో 1866 మంది రోగులు అడ్మిట్ అయ్యారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో 955 హెచ్‌1ఎన్‌1 కేసులు కూడా నమోదయ్యాయి.

H1N1 చరిత్ర..
2009-2010 సంవత్సరంలో H1N1 భారతదేశంలో విధ్వంసం సృష్టించింది. అప్పుడు దాన్ని సాధారణ భాషలో స్వైన్ ఫ్లూగా చెప్పుకున్నారు. భారతదేశంలోని ICMR యొక్క 27 పరిశోధనా ప్రయోగశాలలు కూడా ఈ కేసులను అధ్యయనం చేస్తున్నాయి. అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం దేశంలో మూడు రకాల వైరస్‌లు చురుకుగా ఉన్నాయి. ఇందులో ఇన్ఫ్లుఎంజా A వైరస్ అత్యంత ప్రబలమైన ఉప రకం H3N2.

ICMR సలహా మేరకు..
H3N2 వ్యాధిలో ఇది ఇతర వైరస్‌ల కంటే చాలా ప్రమాదకరమైనది. దీనితో బాధపడుతున్న రోగులు ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది. దీన్ని నివారించడానికి ICMR సూచించింది.

  • మాస్క్ ధరించండి. ప్రస్తుతానికి రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండండి.
  • దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోటిని కవర్‌ చేసుకోండి.
  • కళ్లు, ముక్కును పదేపదే తాకవద్దు.
  • జ్వరం, ఒంటి నొప్పి ఉంటే, పారాసెటమాల్ తీసుకోండి.
  • ఒకరితో ఒకరు కరచాలనం చేసుకోకండి.
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయవద్దు.
  • డాక్టర్ చెబితే తప్ప, యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు.
  • గ్రూపులుగా కలిసి కూర్చొని ఆహారం తినడం మానుకోండి.
    Advertisement

    తాజా వార్తలు

    Advertisement