Friday, April 26, 2024

ఏపీ ప్రభుత్వం పరిధి దాటి అప్పులు తీసుకుంటోంది: జీవీఎల్

బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సోమవారం నాడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులపై నిర్మలా సీతారామన్‌కు తెలిపానని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం పరిధిని మించి అప్పులు చేస్తోందని ఆమెకు వివరించానని తెలిపారు. రుణాలు తీసుకునేందుకు నిబంధనలను కూడా అతిక్రమిస్తున్న విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లానని జీవీఎల్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనా ఈ సమావేశంలో మాట్లాడానని తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల్లోనూ ఇవే ఫలితాలు: సజ్జల

Advertisement

తాజా వార్తలు

Advertisement