Thursday, April 25, 2024

కేసీఆర్‌ను మించిన హిందూవు లేడు: గుత్తా సుఖేందర్‌రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ను మించిన హిందూవు లేడన్నారు. అందుకే యాదాద్రిలో నరసింహస్వామి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ మేరకు నల్గొండలోని ఆయన నివాసంలో గుత్తా మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో దేశద్రోహులు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసేవారికి స్థానం లేదని గుత్తా స్పష్టం చేశారు. తెలంగాణలో అన్ని మతాలు, కులాల ప్రజలు కలిసి జీవిస్తున్నారని.. వారి మధ్య విభేదాలు సృష్టించడమే లక్ష్యంగా బీజేపీ నేతలు నికృష్టపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్రలో మతోన్మాదాన్ని పెంచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని గుత్తా ఆరోపించారు. బండి సంజయ్ కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కారు అడ్డగోలుగా నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగల మాటలు ప్రజలు వినకూడదని, వారి మాటలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ వార్త కూడా చదవండి: విజయమ్మ ఆత్మీయ సభపై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement