Friday, April 19, 2024

తెలంగాణ మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి!

తెలంగాణ రాష్ట్ర శాస‌న మండ‌లి చైర్మెన్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి దాదాపు ఖాయం అయిపోయారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేసిన‌ట్టు స‌మాచారం. మండలి చైర్మెన్ ఎన్నిక ప్ర‌క్రియకు సంబంధించిన అనుమ‌తుల కోసం ఈ రోజు గ‌వ‌ర్న‌ర్ సంప్ర‌దించే అవ‌కాశాలు ఉన్నాయి. నేడు మండ‌లి చైర్మెన్ ఎన్నిక‌కు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి ల‌భించ‌గానే.. ఈ రోజే ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ సైతం విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంది.

నోటిఫికేషన్ వ‌చ్చిన మ‌రుస‌టి రోజే నామినేషన్స్ ప్ర‌క్రియ ఉంటుంది. ఈ నెల 12న చైర్మెన్ ఎన్నిక కోసం ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. శాస‌న మండ‌లిలో టీఆర్ఎస్ కు స్ప‌ష్టమైన మెజార్టీ ఉండ‌టంతో ఈ ఎన్నిక దాదాపు ఎక‌గ్రీవం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. శాస‌న మండలి డిప్యూటీ చైర్మెన్ గా బండా ప్రకాశ్ పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. కాగా, గుత్తా సుఖేందర్ రెడ్డి గతంలోనూ మండలి చైర్మన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement