Friday, March 29, 2024

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. టెక్సాస్‌లోని బ్రయాన్‌లోని పారిశ్రామిక పార్కులోని క్యాబినెట్ తయారీ పరిశ్రమలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ఒకరు మృతి చెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. టెక్సాస్ రాష్ట్రంలోని బ్రియాన్ నగరంలో ఓ బిజినెస్ పార్క్‌లో కెంట్ మూర్ క్యాబినెట్ ఎదుట మధ్యాహ్నం ఈ కాల్పులు జరిగాయి. దుండగుడు కెంట్ మూర్ క్యాబినెట్ కంపెనీలో ఉద్యోగిగా భావిస్తున్నారు. కాల్పులు జరపడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే కాల్పులకు మాత్రం కారణాలు తెలియరాలేదు. ఘటనపై టెక్సాస్‌ గవర్నర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టెక్సాస్‌ రేంజర్స్‌తో కలిసి పని చేస్తున్నామని, స్థానిక చట్ట అమలుకు సహాయం చేస్తామని టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబోట్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement