ఒక మహా ఉద్యమంలా కొనసాగుతోంది ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం.ఇప్పటికే ఈ కార్యక్రమంలో ఎంతోమంది సెలబ్రిటీలు..రాజకీయ నాయకులు పాల్గొన్నారు. తాజాగా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించి శిల్పరామం రాక్ పార్క్ ఆవరణలో మొక్కలు నాటారు మరో హీరోయిన్ రెజీనా..ప్రొడ్యూసర్ సునీత. ఈ సందర్భంగా నటి రెజినా .. ప్రొడ్యూసర్ సునీత మాట్లాడుతూ ఇంతటి గొప్ప గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం లో మాకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశంలో పచ్చదనం పెరగాలని ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ఇండియా చాలెంజ్ చేపట్టి అందరిలో స్ఫూర్తిని నింపుతున్నారు.ఈ ఛాలెంజ్ లో అందరూ భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఛాలెంజ్ లో భాగంగా నివేదా థామస్ మొక్కలు నాటాలని రెజీనా కోరగా, శ్రీ సింహ, కాళ బైరవ విరిద్దరినీ మొక్కలు నాటాలని సునీత కోరారు. .అంతే కాకుండా మాకు ఎంతో ఇష్టమయిన పారిజాతం, వేప మొక్కలను నాటడం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement