Thursday, April 18, 2024

మొక్క‌లు నాటిన మ‌ణిశ‌ర్మ‌-థ‌మ‌న్..మ‌హ‌తి స్వ‌ర్ సాగ‌ర్ కి గ్రీన్ ఇండియా ఛాలెంజ్

టాలీవుడ్ లో కెరీర్ ప‌రంగా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ ని..సూప‌ర్ డూప‌ర్ హిట్స్ ని అందుకున్నారు ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ‌.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ని ..మరికొన్ని సినిమాలకు ఎప్పటికీ మరిచిపోలేని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించారు మణిశర్మ. మీడియాలో కనిపించటానికి పెద్దగా ఇష్టపడని మణిశర్మ, తన మాట కంటే పాట ఎక్కువగా ప్రేక్షకులకి చేరువ కావడం ముఖ్యం అంటుంటారు. గత కొన్నాళ్లుగా తెలంగాణ ఎంపీ సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటివరకు అనేకమంది సెలబ్రిటీలు పాల్గొని తమ వంతుగా మొక్కలు నాటి పర్యవరణానికి తమ వంతుగా మేలు చేయగా నేడు అదే కార్యక్రమంలో పాల్గొన్నారు మణిశర్మ. ఎంపీ సంతోష్ చేపట్టిన ఇంతటి బృహత్ కార్యంలో తాను కూడా భాగస్వామిని కావడం ఆనందంగా ఉందని, పలు మొక్కలు నాటారు మణిశర్మ. వృక్షో రక్షతి రక్షితః అనే మాటని గుర్తుంచుకుని తన అభిమానులు అందరూ మొక్కలు నాటాలని ఆయన కోరారు. అలానే తాను ఈ ఛాలెంజ్ ని మ్యూజిక్ సెన్సేషన్ థమన్ తో పాటు తన కుమారుడు యువ మ్యూజిక్ డైరెక్టర్ అయిన మహతి స్వర సాగర్ కి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement