Friday, April 19, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్క‌లు నాటిన‌ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా నాంపల్లిలోని రైతు బంధు సమితి కార్యాలయ ప్రాంగణంలో ఎమ్మెల్సీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం దిశగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

గ్రీన్ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కు అభినందనీయులు అన్నారు. దీని ద్వారా తెలంగాణ పచ్చని తెలంగాణ దిశగా ముందుకు వెళుతుంద‌ని, తెలంగాణ దేశానికే మార్గదర్శిగా నిలుస్తుంద‌న్నారు. హరితహరం స్పూర్తితో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రత్యేక దాన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement