Wednesday, April 24, 2024

ఘ‌నంగా షిరిడీ సాయి వ‌ర్ధంతి ఉత్స‌వం.. ఊరేగింపులో భ‌క్తుల సంద‌డి!

షిరిడీ (ప్ర‌భన్యూస్‌): సాయిబాబా వర్ధంతిని షిరిడీలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా బాబా చిత్రపటాన్ని, పోతి, వీణను ఊరేగించారు. కార్య‌క్ర‌మానికి సంస్థ తాత్కాలిక కమిటీ సభ్యుడు, కలెక్టర్‌ డాక్టర్‌ రాజేంద్ర భోసలే వీణ ప‌ట్టుకోగా, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ భాగ్యశ్రీ బనాయత్‌ పోతితో ముందు భాగాన న‌డిచారు.

ఇక‌.. హాస్పిటల్‌ మెడికల్‌ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్ డాక్ట‌ర్‌ శైలేష్ ఓక్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస‌ర్‌.. సూపరింటెండెంట్ నవనాథ్ కోటే చిత్రపటంతో ఊరేగింపులో పాల్గొన్నారు. కాగా, ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా మెజిస్ట్రేట్ గోవింద్ షిండే, తహసీల్దార్ కుందన్ హైరే, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కైలాస్ ఖరాడే, డిఫెన్స్ ఆఫీసర్ అన్నాసాహెబ్ పరదేశి, ఆలయ ప్రధానాధికారి, సాయి భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement