Friday, April 19, 2024

 ఆంధ్రప్రదేశ్ భవన్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణంలోని బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఏపీ భవన్ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఢిల్లీలోని 20 చర్చిల పాస్టర్లను ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ భవన్ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. పలువురు పాస్టర్లు దైవ సందేశాన్ని ఇచ్చారు. క్రిస్మస్ పాటలు, డాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement