Thursday, April 25, 2024

కొత్తగూడెం జిల్లాలో ప‌ర్య‌టించిన గ‌వ‌ర్న‌ర్ – వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన త‌మిళిసై

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ప‌ర్య‌టించారు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై. ఇటీవల భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం పాములపల్లి, భట్టిలగుంపు వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను, రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ముంపు ప్రాంతాల ప్రజలకోసం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను గవర్నర్ పరిశీలించారు. ఈ సమయంలో మహిళలు కన్నీరు పెట్టుకుంటూ గవర్నర్ బాధలు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో అందిస్తున్న ఆహారం, వైద్య సదుపాయాలను గవర్నర్ పరిశీలించారు. గవర్నర్ తమిళిసై స్వయంగా వరద బాధితులకు అన్నం వడ్డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement